★అక్కినేని"మనసులోని మాట"పార్ట్ -10★
★అక్కినేని"మనసులోని మాట"పార్ట్ -10★ #రామబ్రహ్మంగారు సరదాకి తమాషాలు చేస్తూ నన్ను ఆటపట్టించే వారు.అప్పుడు డిస్ట్రీబ్యూటర్లు దగ్గరనుంచి ప్రతి నెలా కొంత డబ్బు వస్తుండేది. ఒక్కోసారి కాస్త ఆలస్యమయేది. అప్పుడు రామబ్రహ్మంగారు "ఒరే షావుకారూ - ఓ రెండు వేలు ఇవ్వరా....అనేవారు. నేను బాంక్లో దాచుకున్న డబ్బులోంచి, రెండువేలకు చెక్కు రాసి ఇచ్చే వాడిని ఎంత అనందపడే వాడినో! నేను చెక్కురాసి ఇచ్చానని. అప్పట్లో ఆఫీసు జీతాలు 200, 300 అలా వుండేవి.ఆ తర్వాత డబ్బు రాగానే నాకు తిరిగి ఇచ్చేసేవారు. ఎంత ఆప్యాయత! ఎంత చనువు అలాగే మధుసూదనరావు గారు నా మీద 'డేగ కన్ను' వేసి వుంచేవారు. అభివృద్దిలోకి రావలసిన కుర్రాడిని గనక, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు చెబుతూ వుండేవారు. ఓ కంటితో నన్ను కనిపెట్టమని, లంక సత్యం గారికి అప్పజెప్పారు. ఇలాంటి కట్టుదిట్టాల మధ్య, నా బాగోగులు చూస్తూ నా అభివృద్ధి కాంక్షించారు పెద్దలు. క్రమశిక్షణకీ, ఒక విధానానికీ కట్టుబడి వుండాలని, అవే భావి జీవితాన్ని రక్షిస్తాయనీ, అందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయనీ నిదానంగా తెలుసుకున్నాను. మనం పెరిగే వాతావరణం, మెసిలే పరిసరాలు, మనుషులవ్యక్త